Tuesday, November 8, 2011

420 case on chandra babu naidu

                                                   
                                     420 case on chandra babu naidu


 



రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై చైతన్యపురి పోలీసులు మంగళవారం 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారని జనార్దన్ గౌడ్ అనే న్యాయవాది ఈ పిటిషన్ ను వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం బాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.

అంతకు ముందు ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించినా చైతన్యపురి పోలీసులు పట్టించుకోవటం లేదంటూ ఈ ఉదయం రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందుకు సంబంధించి వారంరోజుల్లోగా వివరణ ఇవ్వాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. విచారణ వచ్చేవారానికి వాయిదా పడింది.