Friday, December 30, 2011

18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ: జగన్/YSR Cong stands to ethics on By elections



18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ: జగన్/YSR Cong stands to ethics on By elections


హైదరాబాద్: ఉప ఎన్నికలలో తమ పార్టీ మొత్తం 18 స్థానాల్లో పోటీ చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. ఉప ఎన్నికలలో తమ పార్టీ అనుసరించే విధానాలను ఆయన ఈరోజు తెలిపారు. రైతుల కోసం విప్ ని ధిక్కరించిన ఎమ్మెల్యేలే తమ పార్టీ అభ్యర్థులని ఆయన ప్రకటించారు. రాజీనామా చేసిన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తమ పార్టీ తరపున పోటీ చేస్తారని చెప్పారు. టిడిపి కుమ్మక్కు విధానాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి కూడా తమ పార్టీ తరపున పోటీ చేస్తారని తెలిపారు.

తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారిపై పోటీ పెట్టం అని ఆయన స్సష్టం చేశారు. బలమైన ఆకాంక్షతో వారు పదవులు వదులుకున్నందున వారిని గౌరవించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.

అకాల మరణం చెందిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి సతీమణిని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయమని కోరుతున్నామని చెప్పారు. ఒక వేళ ఆమె వేరే పార్టీ నుంచి పోటీ చేసినా, ఆమెపై పోటీ పెట్టం అని జగన్ స్పష్టం చేశారు.